ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ దారి మర్చిపోవడంతో.. ముగ్గురు రోగులు మృతి

by  |
ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ దారి మర్చిపోవడంతో.. ముగ్గురు రోగులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ఆపత్కాలంలో ఆక్సిజన్ వాల్యూ ఎంటనీ ప్రతి ఒక్కరికీ తెలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణవాయువు తయారీ, సరఫరాపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. దీనంతటికీ కరోనా మమహ్మరి కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి అందించడం కొంచెం ఆలస్యమైతే చాలు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి.

మరికొందరైతే నడుస్తూ, నిలబడి, కూర్చుని ఎక్కడి వారు అక్కడే ఊపిరి అందక పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడం, డ్రైవర్ దారి మర్చిపోవడం వలన ముగ్గురు రోగులకు ప్రాణవాయువు సకాలంలో అందలేదు.



Next Story

Most Viewed