జోగిపేటలో దారుణం.. బాలికపై ముగ్గురి అఘాయిత్యం

by  |
B.Com student rape
X

దిశ, ఆందోల్ : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story