‘యాస్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో భారీ వర్షం.. ముగ్గురు మృతి

by  |
‘యాస్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో భారీ వర్షం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో పాటు అది కాస్త ఎల్లుండికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అదే విధంగా విజయనగరం జిల్లా చింతాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పిడుగు పాటుకు ముగ్గురు మృత్యువాత పడ్డారు. యాస్ తుఫాన్ ప్రభావం వలన ఏపీ, బెంగాల్, ఒడిషా, తమిళనాడు తీరంపై భారీ ప్రభావం ఉండనున్నట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రెస్క్యూ, రిలీఫ్, ఆపరేషన్ కోసం యుద్ధనౌకలు, హెలీకాప్లర్లు సిద్ధం చేయించినట్లు ప్రకటించింది.


Next Story

Most Viewed