తూర్పుగోదావరిలో కారు బోల్తా.. ముగ్గురి మృతి

by  |
తూర్పుగోదావరిలో కారు బోల్తా.. ముగ్గురి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటిపల్లి, యనాం ఏటిగట్టుపై వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆ సమయంలో కారు అతివేగంగా ప్రయాణించడం వల్లే అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతులంతా యానాంకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.


Next Story

Most Viewed