అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

by  |
agrigold
X

దిశ, ఏపీబ్యూరో : అగ్రిగోల్డ్ కేసులో బుధవారం ముగ్గురు కీలక నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ అభియోగాలపై అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్‌లను ఈడీ అదుపులోకి తీసుకుంది. వేల కోట్ల మనీల్యాండరింగ్‌, హవాలా కేసులకు పాల్పడ్డట్టు అభియోగం మోపింది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో సుమారు 9 లక్షల మంది నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్టు అగ్రిగోల్డ్‌పై అభియోగాలున్నాయి. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులు, చార్జిషీట్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఈడీ విభాగం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తోంది. కుంభకోణం ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ ముగ్గుర్ని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్​ విధించింది.



Next Story

Most Viewed