మద్యం వ్యాపారి పైకి తుపాకీ గురిపెట్టి..

by  |
మద్యం వ్యాపారి పైకి తుపాకీ గురిపెట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో తుపాకీ వాడకం స్థానికంగా కలకలం రేపింది. కేసముద్రం మండలం ఉప్పరపల్లికి చెందిన ఇద్దరు యువకులు ఓ మద్యం వ్యాపారికి తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. వీరికి ఓ మహిళ సహకరించినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసమే వీరు ఇదంతా చేసినట్లు సమాచారం.

అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు యువకులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులకు గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed