వేధిస్తున్నాడని రౌడీషీటర్ దారుణ హత్య..

by  |
వేధిస్తున్నాడని రౌడీషీటర్ దారుణ హత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో రౌడీషీటర్ ను ముగ్గురు యువకులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా ఆరిలోవలో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. కోదాడ సాయి స్థానికంగా రౌడీయిజం చెలాయిస్తుంటాడు. అందులో భాగంగా ముగ్గురు యువకులను పలుమార్లు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువకులు కోదాడ సాయిని దారుణంగా హత్యచేశారు. ఈ హత్య స్థానికంగా అందరినీ భయాందోళనకు గురించేసింది. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.



Next Story

Most Viewed