వీధి వ్యాపారిని చంపిన ఉగ్రవాది హతం

by  |
Encounter1
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భారత జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో భారత జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ‘ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు గందర్‌బల్‌కు చెందిన ముఖ్తార్ షాగా గుర్తించబడ్డాడు. అతను బీహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్ అనే వీధి వ్యాపారిని చంపాడు’ అని కుమార్ తెలిపారు.


Next Story