కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం

by  |
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం
X

కర్నూల్, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం కలిచాట్ల వంతెన వద్ద లారీ – కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌గౌడ్, లింగం, శ్రీనివాస్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.


Next Story