అతి వేగానికి ముగ్గురు బలి

by  |
అతి వేగానికి ముగ్గురు బలి
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు నుంచి కర్నూలు వెళ్తుండగా జిల్లాలోని గుత్తి హైవేపై చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కర్నూలు జిల్లా వాసులు ఖాసీంగా , లాయక్‌ అలీ, గుల్బర్గాకు చెందిన అశ్రఫ్‌ అలీ గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed