మహిళా పోలీస్ అధికారిని తిట్టిన ముగ్గురి అరెస్ట్

by  |
మహిళా పోలీస్ అధికారిని తిట్టిన ముగ్గురి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బెంగళూరులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత శనివారం బెంగళూరులోని పీన్యా ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళా ఎస్ఐ(ట్రాఫిక్ పోలీస్) పార్వతీబాయి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వారిని నిలిపి తనిఖీలు చేశారు. అయితే ఈ సమయంలో గిరీష్ గౌడ అనే వ్యక్తి అక్కడకు చేరుకుని మీరు ఇక్కడ వాహనాలను ఎందుకు ఆపుతున్నారని, వెళ్లిపోవాలని ఎస్ఐని బెదిరించాడు. దీంతో అక్కడనున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. కానీ, ఆ తర్వాత 20 మందితో తిరిగి అక్కడకి చేరుకుని పార్వతిపై నోరు పారేసుకుంటూ ఆమెను బెదిరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గిరీష్ గౌడ, ప్రశాంత్ గౌడ, వినయ్‌లను అరెస్ట్ చేశారు.

tags : karnataka police, traffic SI, Girish Gowda, vehicles

Next Story

Most Viewed