విశాఖలో దొంగల బీభత్సం

by  |
విశాఖలో దొంగల బీభత్సం
X

దిశ, విశాఖపట్నం: అచ్యుతాపురం మండలం చోడపిల్లి గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సీతారామయ్య ఇంట్లో చొరబడిన దుండగులు 50తులాల బంగారం, రూ.2.50లక్షలు దోచుకెళ్లారు. ఇదేక్రమంలో అడ్డుకున్న సీతారామయ్య, అతని భార్య కుమారితో పాటు, కుమారుడు సత్యనారాయణను తీవ్రంగా కొట్టి సొత్తును అపహరించుకుపోయారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు ప్రస్తుతం అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed