టాలీవుడ్ దివాళీ ట్రీట్ రెడీ..

by  |
టాలీవుడ్ దివాళీ ట్రీట్ రెడీ..
X

దిశ, వెబ్ డెస్క్: పండుగ వాతావరణం సందడిగా ఉండాలి. దీపావళి అంటే సెలబ్రేషన్స్ బ్లాస్ట్ అయిపోవాలి. అదే సినిమా ఇండస్ట్రీ అయితే, సెలబ్రేషన్స్ మరింత అదిరిపోవాలి. అందుకే కరోనా కాలమైనా..లాక్‌డౌన్ అడ్డుకున్నా సరే..ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రేక్షకులకు దీపావళికి మంచి ట్రీట్ రెడీ చేశాయి నిర్మాణ సంస్థలు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న మల్టీ స్టారర్ మూవీ ‘మహాసముద్రం’ నుంచి దివాళీ కానుక సిద్ధం చేశారు. శర్వానంద్, సిద్ధు హీరోలుగా వస్తున్న సినిమాకు అజయ్ భూపతి డైరెక్టర్. శనివారం ఉదయం 9: 09 నిమిషాలకు థీమ్ పోస్టర్ రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యూయల్ కథానాయికలు.

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న సినిమాకు సంపత్ నంది కథ అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకులు. కన్నడ హీరో సింహా, బ్యూటిఫుల్ హెబ్బా పటేల్ నటిస్తున్న విలేజ్ లవ్ స్టొరీలో సర్ ప్రైజ్ చేంజ్ ఓవర్ తో ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ లుక్ అన్ ఎక్స్పెక్టెడ్ వే లో దీపావళికి మరింత పండగ సందడిని యాడ్ చేయనుండగా.. శనివారం ఉదయం. 11 గం. లకు విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ శింబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఈశ్వరుడు’ నుంచి కూడా దీపావళి అప్ డేట్ ఇవ్వనుంది మూవీ యూనిట్. బ్రహ్మ ముహూర్తంలో శనివారం ఉ: 4:32 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనుంది. నిధి అగర్వాల్ కథానాయికగా వస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌కు సుశీంద్రన్ దర్శకులు. ఈ సందర్భంగా ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం ప్రతీ ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు.

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ దీపావళి రోజున కొత్త సినిమా ప్రకటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ చిత్రానికి రమణ తేజ దర్శకులు కాగా.. సాగర్ మహతి సంగీతం అందించనున్నారు.

https://twitter.com/AKentsOfficial/status/1327198363499057155?s=19

Next Story

Most Viewed