ఇండియాలో 64,399 కొత్త కేసులు

by  |
ఇండియాలో 64,399 కొత్త కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 64,399 కొత్త కేసులు నమోదయ్యాయి. 861 మంది మృతిచెందారు.

దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 21 లక్షల 53,010 కు చేరింది. ఇందులో 14,80,884 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6,28,747 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి 43,379 మంది మృతిచెందారు.

Next Story

Most Viewed