కరోనా అదును చూసి సైబర్ దోపిడీ

by  |

దిశ, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలవుతుండగా మరోవైపు సైబర్ నేరస్తులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. చార్మినార్‌కు చెందిన డాక్టర్‌ షేక్ సమద్ అబ్డుల్లా మాస్కుల కొనుగోలు కోసం అలీబాబా వెబ్‌సైట్‌ను విజిట్ చేశాడు. ఇంతలోనే ఆయనకు
ఆగంతకుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తామూ అలీబాబా వెబ్‌సైట్ ద్వారానే మాస్కులు విక్రయిస్తున్నామని చెప్పాడు. ఆగంతకుడి మాటలు నమ్మిన డాక్టర్ 50 బాక్సుల మాస్కులు కావాలని కోరారు. అందుకు రూ. 15 లక్షలు అవుతుందని, ముందుగా 30 శాతం అడ్వాన్స్ చెల్లించాలని ఆగంతకుడు డాక్టర్‌కు తెలిపారు. దీంతో షేక్ సమద్ వెంటనే ఆ ఆగంతకుడు సూచించిన బ్యాంకు అకౌంట్‌కు రెండు విడతల్లో రూ. 4.11 లక్షలు పంపించాడు. ఆ తర్వాత నుంచి ఆగంతకుడి ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంతో దిక్కుతోచని స్థితిలో ఆ వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు.

Tags: Theft, Cyber ​​criminals, corona masks, doctor, hyderabad

Next Story

Most Viewed