ఆలయంలో చోరీ.. హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు

by Batti.Sumithra |   (  Updated:2021-10-31 23:53:04  IST  )

<p>దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ నగర్ డివిజన్ రామ్‌ నరేష్‌ నగర్ రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి రామాలయ గోడదూకి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన నిర్వాహకులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలోని రూ.50 వేల నగదుతో పాటు, మరో చిన్న హుండీని సైతం ఎత్తుకెళ్లారని నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న అనంతరం ఆలయానికి చేరుకున్న కేపీహెచ్‌బీ [&hellip;]</p>

theft, ramalayam
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ నగర్ డివిజన్ రామ్‌ నరేష్‌ నగర్ రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి రామాలయ గోడదూకి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన నిర్వాహకులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలోని రూ.50 వేల నగదుతో పాటు, మరో చిన్న హుండీని సైతం ఎత్తుకెళ్లారని నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న అనంతరం ఆలయానికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు.

Next Story