భూపాలపల్లిలో అర్ధరాత్రి కిటికీలు పగులకొట్టి ఘాతుకం..

by  |
భూపాలపల్లిలో అర్ధరాత్రి కిటికీలు పగులకొట్టి ఘాతుకం..
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న జ్యూవెలరీ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు దుకాణం యొక్క కిటికీలు పగులగొట్టి షాపులోకి చొరబడి 30 తులాల బంగారం, 20 కిలోల వెండి ప్లేట్లు, 8 కిలోల వెండి పట్టీలను అపహరించారు. బుధవారం ఉదయం షాపు తెరిచేసరికి చెల్లాచెదురుగా వస్తువులు కనిపించేసరికి అవాక్కయిన షాపు యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.36 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయినట్లు యజమాని అశోక్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.


Next Story