- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఆమె వయసు 23 సంవత్సరాలు. పెళ్లీడుకు వచ్చిందని తల్లిదండ్రులు ఏడాది నుంచి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్కటి కూడా సెట్ కాలేదు. ఇక తనకు పెళ్లి కాదేమో అని సందేహించిన యువతి ఘోరమైన పనికి తెగపడింది. తల్లిదండ్రులను ఒంటరి వారిని చేసి వెళ్లింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ కు చెందిన కావ్య.. కృష్ణానగర్ ఏ బ్లాక్ లో నివాసం ఉంటుంది. ఆమెకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ఏడాది కాలంగా సరైన వరుడి కోసం వెతుకుతున్నారు. చాలా మంది అబ్బాయిలు వచ్చి కావ్యను చూసి వెళ్లారు. కానీ ఏ ఒక్కరూ పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన కావ్య శనివారం రాత్రి తన బెడ్ రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు పాడే ఎక్కడంతో తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.