ఆ బాధ తట్టుకోలేక యువతి బలవన్మరణం

by  |
ఆ బాధ తట్టుకోలేక యువతి బలవన్మరణం
X

దిశ, పాలేరు: కడుపునొప్పి తాళలేక ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కూసుమంచి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గంగబండ తండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మృతిరాలి తండ్రి, పోలీసులు కథనం మేరకు.. వాడిత్య అనిత(18) డిగ్రీ చదువుతుంది. తరచూ కడుపులో నొప్పి వచ్చేదని తల్లిదండ్రులు శంకర్, జయ తెలిపారు. తల్లిదండ్రులు పాలేరు గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లిన క్రమంలో కుమార్తె అనిత ఇంట్లో ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story