విద్యుద్ఘాతంతో యువకుడు మృతి

by  |
విద్యుద్ఘాతంతో యువకుడు మృతి
X

దిశ, రంగారెడ్డి: విద్యుద్ఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ధారూర్ మండలం నాగారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేస్తున్న సమయంలో తేలి ఉన్న వైరు చేతిమీద పడటంతో గ్రామానికి చెందిన గౌస్(22) అనే యువకుడికి విద్యుత్ షాక్ కొట్టి పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం తాండూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు.

Tags : young man, died, corrent shock, rangareddy, dharur, current wire

Next Story