కరోనా పాజిటివ్ వచ్చిందని యువకుడు ఏం చేశాడంటే?

by  |
కరోనా పాజిటివ్ వచ్చిందని యువకుడు ఏం చేశాడంటే?
X

దిశ, నర్సంపేట : కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణం‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… నర్సంపేట బస్టాండ్ కి సమీపంలో సందీప్ (30) అనే యువకుడు సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నియోజక వర్గంలో కరోనా విజృంభిన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సందీప్ కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, శుక్రవారం ఉదయం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story