కోదండరాం ఓటమి తట్టుకోలేక.. యువకుడు ఆత్మహత్యాయత్నం

by  |
కోదండరాం ఓటమి తట్టుకోలేక.. యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, మహబూబాబాద్ : నల్లగొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థి ప్రొ. కోదండ రామిరెడ్డి ఓటమి చెందడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం సాధు తండాకు చెందిన గుగులోత్ రాజు బీటెక్ చదువుతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశాడు.

ప్రొఫెసర్ ఓటమి చెందడంతో తట్టుకోలేక ఆదివారం తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. పక్కనే ఉన్న విద్యార్థులు అతడిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్ లు అక్కడి చేరుకొని రాజుకు నచ్చజెప్పారు.



Next Story

Most Viewed