మహిళ పైకి దూసుకెళ్లిన బస్సు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే

by  |
మహిళ పైకి దూసుకెళ్లిన బస్సు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే
X

దిశ, సంగారెడ్డి: జహీరాబాద్ సమీపంలోని దీడిగి గ్రామ శివారులో బస్సు మహిళ పైకి దూసుకెళ్లింది. అదే దారిన వెళ్తున్న ఎమ్మెల్యే మానిక్ రావు గమనించి బస్సు కింద ఇరుక్కుని తీవ్ర గాయాలైన మహిళలతో పాటు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికుల కథనం ప్రకారం.. బీదర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు, రోడ్డు పక్క ప్రయాణిస్తున్న మహిళపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సు కింద మహిళ ఇరుక్కుపోయింది.

ఈ సమయంలో అదే రహదారిపై వెళ్తున్న ఎమ్మెల్యే మానిక్ రావు తన కాన్వాయ్‌ని అపి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారిని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. గాయలైనవారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను కోరారు. మహిళను సురక్షితంగా బయటికి తీయడానికి పోలీసులు రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. అందరూ కలిసి బస్సును ఒక వైపు లేపడంతో ఇరుక్కుపోయిన మహిళ సురక్షితంగా బయటపడింది. వెంటనే మహిళను జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


Next Story

Most Viewed