మరిపెడలో దారుణం.. భర్త మర్మాంగాలు కోసిన భార్య

by  |
murder
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని వాంకుడోతు తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య మర్మాంగాలు కోసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన భూక్యా బీచ్యా, భార్య ప్రమీల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బీచ్యా నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రమీల మంగళవారం రాత్రి మద్యం సేవించి పడుకున్న భర్త మర్మాంగాల కోసి చంపింది. సమాచారం అందుకున్న మరిపెడ సీఐ సాగర్, ఎస్ఐ ప్రవీణ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతుడి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.



Next Story