- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దిల్సుఖ్నగర్ శివగంగా థియేటర్ ప్రహారి గోడ కూలింది. గోడ కూలిన సమయంలో థియేటర్ లో ఫస్ట్ షో సినిమా నడుస్తోంది. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు తమ ద్విచక్ర వాహనాలను గోడను అనుసరించి పార్కింగ్ చేశారు. అయితే వర్షం కారణంగా కాంపౌండ్ వాల్ బైక్ లపై కూలింది. ఈ ప్రమాదంలో సుమారు 50 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా చూసిన అనంతరం బయటకు వచ్చిన వాహనదారులు ధ్వంసమైన తమ బైకులను చూసి యాజమాన్యంతో గొడవకు దిగారు. యాజమాన్యమే రిపేర్ చేయించి ఇవ్వాలని, లేదా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Next Story