ఏపీలో 7లక్షల 50వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 7లక్షల 50వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 73,625మందికి పరీక్షలు నిర్వహించగా 5,653మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7లక్షల 50వేల 517కు చేరింది. 35మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,194గా ఉంది. ప్రస్తుతం 46,624 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6లక్షల 97వేల 699మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 64,94,099 మందికి కరోనా శాంపిల్స్‌‌ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి ప్రకాశం జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాల్లో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 351మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా చిత్తూరులో 706, తూర్పుగోదావరి జిల్లాలో 706, గుంటూరులో 470, కడపలో 504, కృష్ణా జిల్లాలో 468, కర్నూలులో 119, నెల్లూరులో 322, ప్రకాశంలో 538, శ్రీకాకుళంలో 163, విశాఖ జిల్లాలో 289, విజయనగరం జిల్లాలో 194, పశ్చిమగోదావరి జిల్లాలో 823 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed