- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల జాయింట్ మీటింగ్కు ముందు నుంచి చెప్పినట్టే తెలంగాణ గైర్హాజరైంది. ఈ సమావేశానికి రాలేమంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు లేఖ రాసింది. కానీ బోర్డులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. యథాతథంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి జలసౌధలో సంయుక్తంగా బోర్డుల సమావేశాన్ని మొదలుపెట్టారు. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇరిగేషన్ ఇంజినీర్లు హాజరయ్యారు. తెలంగాణ తరుపున వాదనలు వినిపించారు. గెజిట్కు తమ రాష్ట్రం స్వాగతం చెప్పినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇక తెలంగాణ నుంచి ఈఎన్సీ, ఇంజినీర్లు గైర్హాజరయ్యారు. ఈ మీటింగ్కు కనీసం కీలకమైన ఇంజినీర్లను పంపించాలంటూ బోర్డు నుంచి మౌఖిక సమాచారమిచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు.
Next Story