భార్యతో జతకట్టిన భర్త.. తండ్రిని ఏంచేశారంటే?

by  |
murder
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కనికరం లేకుండా కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నాడు ఓ కొడుకు. ఈ అమానవీయ ఘటన జిల్లాలోని సంతమాగులూరు మండలం సజ్జాపురంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున కోడలు, కొడుకు కలసి తండ్రిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు, కోడలు పరారీలో ఉన్నట్టు సమాచారం.

Next Story

Most Viewed