- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చార్మినార్ : కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ ఎస్.పాండురంగా రావు సేవలు మరువలేనివని మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు అన్నారు. ఆదివారం ఎస్.పాండురంగా రావు 20వ వర్ధంతి సందర్బంగా అయన కుమారుడు యువజన కాంగ్రెస్ నాయకుడు ఎస్.పి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఫలక్ నుమా రెయింబో అనాధ బాలిక వసతి గృహంలో జరిగిన కార్యక్రమానికి వీహెచ్ ముఖ్య అతిధిగా పాల్గొని ఎస్.పాండురంగా రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయం నుండి పాండురంగా రావుతో తనకు మంచి అనుబంధం ఉండేదాని గుర్తుచేసుకున్నారు. ఆయన నిరంతరం పేద ప్రజల సమస్యల పై పోరాటం చేసి పాతనగరంలో ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపుతో పాటు, పాతనగరములో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశాడాని కొనియాడారు. ఈ సందర్బంగా పాండురంగా రావు జ్ఞాపాకర్థం వసతి గృహం విద్యార్థులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులను వీహెచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అఫ్సర్ యూసఫ్, బి.కార్తీక్ చారి, బి.నరేష్, బి.మధు, ఆర్.శివకుమార్, జీ.నవీన్ కుమార్, ఎస్.నగేష్, నరసింహ, బి.వినీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.