స్కూల్‌కు రాలేదని విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి

by  |
student
X

దిశ, ముధోల్ : విద్యార్థి స్కూల్‌కు రాలేదని ఓ ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. మరుసటి రోజు వచ్చిన బాలుడిని రక్తం వచ్చేలా కొట్టి తన శాడిజాన్ని చూపించాడు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థి తల్లిదండ్రులు వివరించారు. వారి వివరాల ప్రకారం..

భైంసా పట్టణం మదిన కాలనీలోని వింగ్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల ఓ రోజు పాఠశాలకు రాలేదు. మరుసటి రోజు స్కూల్‌కు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపల్ కోపంతో చితక బాదాడు. చెంపలపై బలంగా పదే పదే కొట్టడంతో చెవిలో నుంచి రక్తం కారినట్టు విద్యార్థి ఆరోపించాడు. దీంతో భయపడిన ప్రిన్సిపల్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు. దీంతో భయపడిన విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండిపోయాడు. అయితే చెవి నొప్పి ఎక్కువ కావడంతో ఆలస్యంగా ప్రిన్సిపల్ చితకబాదిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం నిర్మల్ తీసుకెనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



Next Story

Most Viewed