వ్యాక్సిన్ ధర నిర్ణయించిన కేంద్రం.. ఎంతో తెలుసా?

by  |
వ్యాక్సిన్ ధర నిర్ణయించిన కేంద్రం.. ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ధర రూ.250గా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా మార్చి 1 నుంచి పబ్లిక్ డొమైన్‌లోకి కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌పై సర్వీస్ ట్యాక్స్ రూ.100 రూపాయలు పిక్స్ చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 1200 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేయనున్నట్టు తెలిపారు. 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సినేషన్ ముందుగా చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.

Next Story