అన్నలల్లో కలుస్తా… స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

by  |
అన్నలల్లో కలుస్తా… స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. న్యాయం కావాలని బాధితుడు బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేక రాసారు. ఇసుక మాఫియా ను అడ్డుకున్నందుకు తనను కొట్టి శిరోముండనం చేయించారని, తనకు న్యాయం చేయకపోతే మావోయిస్టుల్లో కలిసి పోతానని ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖరో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నామని రాష్ట్రపతి కార్యాలయానికి మరో లేఖ రాసింది. కాగా ఈ కేసులో ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు.



Next Story

Most Viewed