గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపుతప్పిన విమానం..

by  |
plane accidant in Gannavaram airport
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. గల్ఫ్ నుంచి గన్నవరం వస్తున్న ఫ్లైట్ గన్నవరంలో ల్యాండింగ్ అవుతుండగా.. అదుపుతప్పి పక్కనే ఉన్న కరెంటు స్తంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలు విరిగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందులో ఉన్న ప్రయాణికలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 19మంది గన్నవరంలో దిగినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. గమనించిన స్థానిక సిబ్బంది వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed