- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్: ప్రమాదకరంగా మారిన డబిర్ పురా వంతెన
by Batti.Sumithra |
<p>దిశ, చార్మినార్: ముసారాం బాగ్ వంతెన పగుళ్లు ఏర్పడిన ఘటన మరువక ముందే ఇటీవల నిర్మించిన పాతబస్తీ డబిర్ పురా వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా మారింది. డబిర్ పురా వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిని గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డబిర్ పురా వంతెనపై గొయ్యి ఏర్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు నిషేధం విధిస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు […]</p>

X
దిశ, చార్మినార్: ముసారాం బాగ్ వంతెన పగుళ్లు ఏర్పడిన ఘటన మరువక ముందే ఇటీవల నిర్మించిన పాతబస్తీ డబిర్ పురా వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా మారింది. డబిర్ పురా వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిని గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డబిర్ పురా వంతెనపై గొయ్యి ఏర్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు నిషేధం విధిస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ, సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం కారణంగానే వంతెనపై గొయ్యి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Next Story






