పశువులు మేపుతున్న వృద్ధుడిపై కత్తులతో దాడి

by  |
murder
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన చిలివేరు మల్లయ్య(60) గురువారం సాయంత్రం తన వ్యవసాయ బావివద్దకు పశువులను మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో మల్లయ్యపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed