- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్ : కరోనా వ్యాక్సిన్ అందరూ తప్పనిసరిగా తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బహుమానాలు కూడా అందజేస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అలానే థర్డ్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి వ్యాక్సిన్ తీసుకోవడానికి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ఎస్కి వెళ్లింది. దీంతో అక్కడి నర్సు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తూ యువతికి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లక్ష్మి ప్రసన్న అనే యువతికి ఓ నర్సు నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసింది. వెంటనే యువతి కల్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమెను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.