జేసీబీని తగులబెట్టిన నక్సల్స్

by  |
జేసీబీని తగులబెట్టిన నక్సల్స్
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో అటవీశాఖ పనులు చేస్తున్న జేసీబీని నక్సల్స్ తగలబెట్టారు. ఛోటే‌డోంగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధోనార్ మార్గంలో అటవీశాఖ చేపట్టిన పనులలో భాగంగా జేసీబీ గొయ్యి తీస్తున్న ప్రాంతానికి 20 నుంచి 25 మంది నక్సల్స్ వచ్చారు. పని ఆపమని జేసీబీ ఆపరేటర్‌ని హెచ్చరించారు. అనతరం జేసీబీ ట్యాంకర్ పగలగొట్టి డిజిల్ తీసి యంత్రంపై పోసి నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆపరేషన్ ప్రహార్‌కి వ్యతిరేకంగా ఏప్రిల్ 26న జరిగే భారత్ బంద్‌కి సంబంధించిన కరపత్రాలను నక్సల్స్ ఆ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో తూర్పు బస్తర్ డివిజన్ నక్సలైట్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఏప్రిల్ 26న జరిగే భారత్ బంద్‌కు సంబంధించిన కరపత్రాలు అక్కడ విడిచి వెళ్ళారు.

Next Story