జిల్లా మారినా పేరు మారలే..అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

by  |
జిల్లా మారినా పేరు మారలే..అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
X

దిశ, కోడేర్ : మండల పరిధిలోని నర్సాయపల్లి గ్రామంలో పశువైద్య శాల భవనం పై నేటికీ ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పేరు దర్శనం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా మార్చి, ఆ తర్వాత 33 జిల్లాలుగా విభజన జరిగి చాలా ఏండ్లు గడుస్తున్నా కొత్త జిల్లా గా ఏర్పడిన నాగర్ కర్నూలు జిల్లా పేరు ఇంకా నర్సాయపల్లి గ్రామంలో ఉన్న పశు వైద్య శాలల భవనం పై ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పేరు దర్శనం ఇస్తుంది. ఇంకా జిల్లా పేరు మార్చకపోవటాకి అధికారులు నిర్లక్ష్యంమే కారణం అని భావించవచ్చును. సంబంధిత అధికారులు స్పందించి పశు వైద్యశాల భవనంపై వెంటనే జిల్లా పేరు మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed