బండి సంజయ్ పాదయాత్ర పేరు ఫిక్స్

by  |
బండి సంజయ్ పాదయాత్ర పేరు ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టే పాదయాత్రకు పేరు ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్రకు ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే హుజురాబాద్​ ఉప ఎన్నిక అంశాన్ని గాలికి వదిలేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ సెగ్మెంట్​లో పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్​ జారీ అయిన తర్వాత తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించనున్నారు. దీన్ని పార్టీ ఇంకా ఖరారు చేయడం లేదు. ఉప ఎన్నిక షెడ్యూల్​ వస్తే అక్కడ పాదయాత్రకు ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Next Story

Most Viewed