- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న పురపోరు ప్రచార సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రచారపర్వాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేసింది. గతంలో రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ నైట్ కర్ఫ్యూ దృష్ట్యా రెండు గంటల సమయాన్ని తగ్గించారు.
అదే విధంగా లౌడ్ స్పీకర్లు, మైక్ల వాడకంపై కూడా నిబంధనలు విధించారు. ప్రచారం మినహా ఇతర కార్యక్రమాలు, ప్రార్థనల కోసం మైక్లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వినియోగించాలని, ఆ తర్వాత వినియోగించరాదంటూ సూచించింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రచారం చేసుకోవాలని, మాస్క్లను తప్పనిసరిగా వాడాలని, ఐదుగురి కంటే ఎక్కువ మంది కలిసి ప్రచారం చేయరాదంటూ ఆంక్షలను మరోసారి వివరించారు. రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు, 8 వార్డులు, ఒక డివిజన్కు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న వీటికి పోలింగ్ నిర్వహిస్తుండగా… ఈ నెల 28 వరకు ప్రచారానికి అనుమతి ఉంది.