కూతురి సంబంధానికి తల్లి ప్రోత్సాహం.. అడ్డుగా ఉన్న మనవడిపై దారుణ చర్య

by  |
boy murder
X

దిశ, సంగారెడ్డి: రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. తప్పుడు దారిలో వెళ్తున్న కూతురిని సక్రమ దారిలో నడిపించాల్సిన తల్లే.. కూతురు వివాహేతర సంబంధానికి అండగా నిలిచింది. అంతేకాకుండా కూతురు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న మనవడిని అతికిరాతకంగా హతమార్చిన హృదయవిదాకరణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నివాసముంటున్న కట్ట నాగమణి కూతురైన సుజాతకు మధుతో వివాహం జరగగా వారికి ఇద్దరు కుమారులు జన్మించారు.

పెద్దకొడుకు మహేష్ (5), చిన్న కొడుకు యశ్వంత్ (2) లతో జీవితం అన్యోన్యంగా సాగుతుండగా సుజాత భర్త మధు 2 సంవత్సరాల క్రితం చౌటకుర్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత సుజాత పుల్కల్ మండలానికి చెందిన జనార్థన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న జనార్ధన్‌ను వివాహం చేసుకోవాలని సుజాత కోరింది. సుజాతకు ఇద్దరు కొడుకులు ఉండడంతో.. పిల్లలు ఉంటే తనను పెళ్లి చేసుకోనని జనార్ధన్ చెప్పాడు. కాగా పెద్ద కొడుకు అయినా మహేష్ ను బంధువులు దత్తత తీసుకుంటారని చెప్పగా చిన్న కొడుకు అయిన రెండు సంవత్సరాల వయసున్న యశ్వంత్ సుజాత పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించింది.

దీంతో సొంత అమ్మమ్మ అయిన నాగమణి పసివాడైన యశ్వంత్‌ను సంగారెడ్డి బొబ్బిలి కుంట చెరువులో పడేసి వెళ్లిపోయింది. నీటిలో ఊపిరాడక ఆ పసికందు అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరగగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మానవత్వం మంట కలిపే లా చేసిన ఈ సంఘటన చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed