మాది ప్రజల పార్టీ :ఎమ్మెల్యే సండ్ర

by  |
political
X

దిశ(వేంసూర్): వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెరాస పార్టీ మండల అధ్యక్షునిగా పాలా వెంకట రెడ్డి , ప్రధాన కార్యదర్శి గా కంటే వెంకటేశ్వరరావు, మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగా రావూరి శ్రీను, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా మూడు రాందాస్ ,బిసి సెల్ అధ్యక్షునిగా పదిలం సాయి బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఎమ్మెల్యే సండ్ర నూతన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది ప్రజల పార్టీ అని , ప్రతి కార్యకర్తతో సమన్వయం పాటిస్తూ గ్రామ స్థాయి లో పార్టీని అభివృద్ధి పరచాలని, కమిటీ లోని ప్రతి ఒక్కరు ప్రజల కోసం కష్టపడి పనిచేసి పార్టీకి మంచిపేరు తీసుకు రావాలని అన్నారు.



Next Story

Most Viewed