పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి.. సంతాపం ప్రటించిన ఎమ్మెల్యే

by  |
పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి.. సంతాపం ప్రటించిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉరుసు మల్లయ్య, అల్లపు రవి మరణించడంతో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. అంతేగాకుండా.. ఆ కుటుంబాలను పరామర్శించాలని నేషనల్ లేబర్ బోర్డ్ డైరెక్టర్ దండుగుల రాజలక్ష్మిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె, ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమిరెడ్డి ఎంపీటీసీ మల్లేశం ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed