స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీ కొని వ్యక్తి మృతి

by  |
స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీ కొని వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి‌కి ఊహించని షాక్ తగిలింది. తన కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ల కల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి నరసింహా రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed