వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

by  |
వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని కాళికా దేవి ఆలయం ముందున్న సెల్ టవర్ ఎక్కి యాదగిరి అనే వ్యక్తి హల్‌చల్ చేశాడు. తన భార్య, పిల్లలు ఇంట్లోంచి వెళ్లిపోతేనే కిందకు వస్తానని, లేకపోతే అక్కడి నుంచి దూకుతానని బెదిరించాడు. వివరాల ప్రకారం.. గత కొద్దిరోజులుగా యాదగిరి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. యాదగిరికి 17, 18 సంవత్సరాల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తరుచూ తనను కొడుకులు కొడుతున్నారని యాదగిరి ఆరోపిస్తున్నాడు.

దీంతో భార్యా పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతే తప్ప.. తాను కిందకు దిగేది లేదని యాదగిరి తేల్చి చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాదగిరికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా.. యాదగిరి వినలేదు. సుమారు గంటసేపు ఇదే తంతు కొనసాగడంతో.. యాదగిరి ఎక్కడ కిందకు దూకేస్తాడోనని.. పోలీసులు, కాలనీవాసులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో కొద్దిసేపటి తర్వాత తన భార్యాపిల్లలు వెళ్లిపోయారని, ఏదైనా సమస్య ఉంటే తాము పరిష్కరిస్తామని పోలీసులు చెప్పడంతో యాదగిరి కిందకు దిగాడు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. తన భార్య లావణ్య తనకు విడాకులు ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిందని, దాంతో మనస్తాపం చెంది టవర్ ఎక్కానని తెలిపాడు.

Next Story