ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చి..

by  |
ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చి..
X

దిశ, నారాయణఖేడ్: రోడ్డు దాటుతూ ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కిందపడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… మనూరు మండలం వల్లూరు గ్రామానికి చెందిన విటల్ అనే వ్యక్తి, అతని కుమారుడు అంజన్నతో కలిసి నారాయణఖేడ్‌కు వచ్చారు. ఈ క్రమంలో కరసగుత్తి రోడ్డులోని వాటికన్ స్కూల్ సమీపంలో వారిద్దరు రోడ్డు దాటుతుండగా నారాయణఖేడ్ నుంచి బీదర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అంజన్న తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెనక టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అంజన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తీసుకొచ్చానని తండ్రి విట్టల్ చెప్పి బోరుమన్నాడు. ప్రాణాలను కాపాడుకోవాలని వచ్చి.. ఆ ప్రాణాలే పోగొట్టుకున్నాడని విలపించాడు.

Next Story