- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, శేరిలింగంపల్లి: అచ్చం ఐటీ అధికారుల్లాగే సూటు బూటు వేసుకుని వచ్చారు. మేము ఐటీ అధికారులం, మీ ఇంట్లో సోదాలు చేయాలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఇల్లంతా వెతికి కాగితాలు వదిలేసి, ఇంట్లో దొరికిన 35 తులాల బంగారం, లక్షా 75 వేల నగదు కాజేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. వచ్చిన వాళ్లు ఎవరో తేల్చుకునే లోపే జంప్ అయ్యారు. ఈ ఫేక్ ఐటీ ముఠాపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ముఠాను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు.
నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్ లో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఐటీ అధికారులమంటూ వారి ఫోన్లు తీసుకుని తమ దగ్గర పెట్టుకున్నారు. భాగ్యలక్ష్మి దగ్గర లాకర్ తాళాలు తీసుకొని అందులోని 35 తులాల బంగారం, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయారు. తనకు ఎలాంటి వివరాలు చెప్పకపోవడం, తీసుకెళ్తున్న నగదు వివరాలు అందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు గచ్చిబౌలి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.