పంచాయితీ పెట్టిన భార్య.. బండరాళ్లతో కొట్టి చంపిన భర్త

by  |
పంచాయితీ పెట్టిన భార్య.. బండరాళ్లతో కొట్టి చంపిన భర్త
X

దిశ, మంథని: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను బండ రాళ్లతో కొట్టి చంపిన ఘటన మంథనిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపెట బానయ్య-రేణుకలు భార్యాభర్తలు. మనస్పర్థల కారణంగా గత కొన్నాళ్లుగా వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో రేణుక మధ్యలో నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే ఆమె వెనకాలే వెళ్లిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. బండరాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో భార్య రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్ర కుమార్ తెలిపారు.


Next Story