దేవాలయ భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

by  |
దేవాలయ భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
X

దిశ.బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం ఏల్లూరు శివారులోని సర్వే నెంబర్లు 49. 53. 62. 63. నందు గల భూముల హద్దులను మంగళవారం గుర్తించి సర్వే చేసి ఐదు ఎకరాల 87 సెంట్ల భూమిని స్వాధీనపరచుకున్నట్లు దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి పెండ్యాల వామన్ రావు తెలిపారు. ఆ భూములను స్వాధీనం చేసుకొని దేవాదాయశాఖ భూములుగా బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణ అధికారి పరిశీలకులు రాజమౌళి, సిబ్బంది భాను, ఆలయ పూజారులు దేవేందర్, గంగాధర్, పోలీస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed