అప్పుకు వడ్డీ విడుదల

by  |
అప్పుకు వడ్డీ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తీసుకున్న అప్పుకు వడ్డీ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నాబార్డు దగ్గర అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్​లో రూ. 200 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం అక్టోబర్​ 1 నుంచి డిసెంబర్​ 31 వరకు వడ్డీ కింద రూ. 52.75 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వడ్డీ సొమ్మును నాబార్డు ఖాతాకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.


Next Story

Most Viewed